Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సతీమణి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ భావోద్వేగానికి లోనైన మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి(Video)

సతీమణి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ భావోద్వేగానికి లోనైన మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి(Video)
, శనివారం, 17 ఆగస్టు 2019 (18:41 IST)
స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడి సమాజం దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పారు కొందరు మహానీయులు.. కాని నేటి సమాజంలో దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చూస్తున్నాం. వీటిలో మార్పు రావాలని ఆశిస్తున్నాం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి చేపట్టిన ఓ కార్యక్రమం అక్కడి వారి హృదయాలను కదిలించింది. 
 
తన అర్థాంగి పల్లె ఉమ ఇటీవల అనారోగ్యంతో కన్ను మూశారు. ఎన్నికల ముందు ఆమె మరణం ఆయన్ను బాగా కుంగదీసింది. ఆయన వేసిన ప్రతి అడుగులో ఆమె సహకారాన్ని పల్లె రఘునాథరెడ్డి మరవలేకపోయారు. అందుకే ఆమె నిత్యం తన ముందే ఉండాలన్న ఉద్దేశ్యంతో ఏకంగా ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 
 
రుద్రంపేటలోనే ఆయనకు సంబంధించి పివికెకె కళాశాలలో ఆమె విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించారు. ఆయన నివాసం కూడా అక్కడే ఉండటంతో ఈ స్థలాన్ని ఎంచుకున్నారు. పల్లె ఉమ తనకు జీవితంలో ఇచ్చిన సహకారం మరవలేనని.. అందుకే ఆమెను స్మరించుకుంటూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు రఘునాథరెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే పల్లె ఉమ ఫౌండేషన్ పేరిట అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని.. ఇవి మరింత విస్తృతం చేస్తామని అంటున్నారు. చూడండి వీడియో... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో భారీ ఉద్యోగావకాశాలు