Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీకు 14.. నాకు 95 .. కాంగ్రెస్ - టీడీపీల మధ్య సీట్ల ఖరారు

నీకు 14.. నాకు 95 .. కాంగ్రెస్ - టీడీపీల మధ్య సీట్ల ఖరారు
, శుక్రవారం, 2 నవంబరు 2018 (11:14 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోభాగంగా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. ఈ మేరకు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. టీడీపీతో 14 సీట్లకు సర్దుబాటు కుదిరిందని స్పష్టం చేశారు. 
 
అలాగే, టీజేఎస్, సీపీఐతో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. అభ్యర్థుల జాబితాను ఈ నెల 8 లేదా 9వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ నివాసంలో సమావేశమైన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. తెలంగాణ ఎన్నికల బరిలో దిగే కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి సమావేశంలో చర్చించారు. 
 
ఇప్పటివరకు పరిశీలించిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారు ఓ కొలిక్కి వచ్చిందని, మొత్తం 95 స్థానాల్లో కాంగ్రెస్‌ బరిలో ఉంటుందని స్పష్టతనిచ్చారు. మిగతా 24 స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తాయని వివరించారు. అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయాలా..? వద్దా? అనే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్‌ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంట్లు తోముతూ అడ్డంగా కూర్చుంది.. దారి ఇవ్వలేదని కర్రతో కొట్టి చంపిన బావ