Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మావోయిస్టు పార్టీకి మరో దెబ్బ... టెక్ శంకర్ ఎన్‌కౌంటర్

Advertiesment
maoists

ఠాగూర్

, గురువారం, 20 నవంబరు 2025 (09:15 IST)
మవోయిస్టు పార్టీకి మరో తేరుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ జోనల్ కమిటీ సభ్యుడు, టెక్నికల్ టీమ్ ఇన్‌చార్జి మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ (51) ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.
 
ఏపీలోని ఏజెన్సీ జిల్లా అయిన అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని జీఎంవలస వద్ద బుధవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన మృతి చెందాడు. ఐఈడీలు, మందుపాతరల తయారీలో టెక్ శంకర్ దిట్టగా పేరుపొందారు. 
 
ఇటీవల హతమైన అగ్రనేత హిడ్మా నేతృత్వంలో జరిగిన అనేక దాడులకు ఈయనే సాంకేతిక సహకారం అందించినట్లు తెలుస్తోంది. ఈ యేడాది జూన్ ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి (ఉదయ్) మరణించడంతో, పార్టీ పునర్నిర్మాణం కోసం కేంద్ర కమిటీ శంకర్‌ను ఏవోబీకి పంపింది. కీలక సమయంలో ఆయన మృతి చెందడం పార్టీకి కోలుకోలేని నష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన జోగారావు, 36 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. 30 ఏళ్ల క్రితం ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామి రెడ్డి హత్య కేసుతో పాటు, అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల హత్య కేసుల్లోనూ ఈయన కీలక పాత్రధారి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు... 22 మంది మృత్యువాత