Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవంబరు 3న టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

నవంబరు 3న టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం
, శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:28 IST)
నవంబరు 3న తెదేపా కేంద్ర కార్యాలయం ప్రారంభంకానుంది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఈ భవన నిర్మాణం జరుగుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారి పక్కనే నిర్మిస్తున్న తెదేపా కేంద్ర కార్యాలయాన్ని నవంబరు 3న ప్రారంభించనున్నారు.

రాత్రి 7గంటల.19 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. తెదేపా కార్యాలయ అవసరాల కోసం మొత్తం మూడు భవనాలు నిర్మిస్తున్నారు. ఒక భవనాన్ని మొదట పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నారు.ఈ భవనాన్ని ప్రారంభించిన తర్వాత పార్టీ కార్యకలాపాల్ని పూర్తిస్థాయిలో అక్కడి నుంచే నిర్వహించనున్నారు.

కొత్త కార్యాలయం సిద్ధమయ్యేంత వరకు ప్రస్తుతం గుంటూరు నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తారు. తెదేపా కేంద్ర కార్యాలయ భవనాల మొత్తం నిర్మిత ప్రాంతం 2.5 లక్షల చదరపు అడుగులు కాగా...,మొదటి భవనం నిర్మితప్రాంతం 75 వేల చ . అడుగులు . దాన్ని జీ + 3 విధానంలో నిర్మిస్తున్నారు.

ఈ భవనం మూడో అంతస్తులో చంద్రబాబు , లోకేశ్ చాంబర్లతో పాటు పొలిట్ బ్యూరో సమావేశ మందిరం ఉండానున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి చాంబర్ మొదటి అంతస్తులో ఉంటుంది . రెండో అంతస్తులో నాలెడ్జ్ సెంటర్, సమాచార కేంద్రం వంటివి ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మా అని పిలుస్తూ అలా చేశాడనీ... మహిళ ఆత్మహత్య