Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

23న రాత్రి 7 గంటలకు జగనాసుర దహనం : టీడీపీ పిలుపు

ysjagan dasara
, ఆదివారం, 22 అక్టోబరు 2023 (16:25 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు పెట్టి జైల్లో బంధించారంటూ టీడీపీ నేతలు, శ్రేణులు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే శబ్దాలు చేయడం, చేతులకు సంకెళ్లు వేసుకోవడం వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఇపుడు మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జగనాసుర దహనం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదే విషయంపై టీడీపీ అధికార ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. 
 
"దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం - మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం. అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నిన‌దిద్దాం. అక్టోబ‌రు 23వ తేదీ విజ‌య‌ద‌శ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా రాత్రి 7 గంట‌ల నుంచి 7.05 నిమిషాల మ‌ధ్య‌లో వీధుల్లోకి వ‌చ్చి "సైకో పోవాలి" అని రాసి ఉన్న ప‌త్రాల‌ను ద‌హ‌నం చేయండి. ఆ వీడియో, ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయండి. సైకో జ‌గ‌న్ అనే చెడుపై మంచి అనే చంద్ర‌బాబు సాధించ‌బోయే విజ‌యంగా ఈ ద‌స‌రా పండ‌గ‌ని సెల‌బ్రేట్ చేసుకుందాం" అని పిలుపునిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దత్తపుత్రిక దాష్టీకం.. ప్రియుడితో కలిసి తల్లిని కడతేర్చిన బాలిక