Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం 2020 నమోదు ప్రక్రియకు శ్రీకారం

అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం 2020 నమోదు ప్రక్రియకు శ్రీకారం
, మంగళవారం, 20 అక్టోబరు 2020 (16:10 IST)
మాలక్ష్మి గ్రూప్ , కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి (సిసివిఏ) సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 19, 20 తేదీల్లో జరిగే అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం -2020 నమోదు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి, మాలక్ష్మి గ్రూపు సంస్థల సీఈవో సందీప్ మండవ విజయవాడ సిసివిఏ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
 
సిసివిఏ గత 5 సంవత్సరాలుగా, విజయవాడలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బహు భాషా కవి సమ్మేళనానికి దేశ విదేశాల నుంచి అనూహ్య స్పందన లభించటమే కాక, వరుసగా లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్‌ను కూడా  సొంతం చేసుకొoదని కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివ నాగి రెడ్డి తెలిపారు.
 
దేశ విదేశాలలోని బహు భాషా కవులు నవంబర్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకొని కవితలను పంపవచ్చని తెలిపారు. మాలక్ష్మి గ్రూపు సంస్థల సీఈవో సందీప్ మండవ మాట్లాడుతూ, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విడత ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
 
రచయితల నుండి వచ్చిన కవితల్లో 100 ఉత్తమ కవితల్ని ఎంపిక చేసి ఆయా కవులను అంతర్జాతీయ కవి సమ్మేళనంలో తమ కవితలను వినిపించటానికి ఆహ్వానిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న కవులు “సిసివిఏ.ఇన్”లో లాగిన్ అయ్యి తమ పూర్తి వివరాలను నమోదు చేయటం ద్వారా అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం -2020లో పాల్గొనగలుగుతారన్నారు. మాలక్ష్మి సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని సందీప్ మండవ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలు జారింది.. అంతే ఆ వృద్ధ దంపతులు మృతి.. ఎక్కడ?