Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దూసుకొస్తున్న దానా తుఫాను... ఏపీపై ప్రభావమెంత?

rain

ఠాగూర్

, బుధవారం, 23 అక్టోబరు 2024 (11:03 IST)
దానా తుఫాను దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయాన్ని వాయుగుండంగా మారింది. ఆ తర్వాత సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగామారింది. బుధవారం తుఫానుగా మారి గురువారం తెల్లవారుజాముకు తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తీవ్ర తుఫాను శుక్రవారం ఉదయం లోపు ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సాగర్ ద్వీపం మధ్యంలో తీరం దాటొచ్చని ఐఎండీ అధికారులు తెలిపారు. 
 
ఈ తీవ్ర తుఫాను దానా ముప్పుపొంచివున్న నేపథఅయంలో ఏపీ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఐఎండీ మాజీ ఎండీ కేజే రమేష్ తెలిపారు. ప్రస్తుతం అంచనచా ప్రకారం ఒడిశా, వెస్ట్ బెంగాల్, స్థానిక పరిస్థితుల వల్ల గమనం మార్చుకుంటే బంగ్లాదేశ్ వైపు వెళ్లవొచ్చని, ఈ కారణంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, వైజాగ్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. 
 
అలాగే, తమిళనాడులో ఈ తుఫాను ప్రభావంతో పాటు ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ తుఫాను ప్రభావం కారణంగా మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఏపీ వ్యాప్తంగా రాబోయే మూడు రోజులు పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పులివెందుల వద్ద 30 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు