Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగాళాఖాతంలో 'దానా' తుఫాను... ఏపీలో మళ్లీ వర్షాలు

mandous cyclone

ఠాగూర్

, సోమవారం, 21 అక్టోబరు 2024 (08:42 IST)
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫానుకు "దానా" అని పేరు పెట్టారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా రాగల 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రాన్న ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆర్ఎంసీ వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని తెలిపింది. 
 
ఈ అల్పపీడనం ఈ నెల 22వ తేదీ నాటికి వాయుగుండంగా, అక్టోబరు 23వ తేదీ నాటికి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 25వ తేదీన కోస్తాంధ్ర, యానాంలలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు, ఈ నెల 20, 24వ తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఈ నెల 20వ తేదీన రాయలసీమలో అక్కడక్కడ బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అందువల్ల జాలర్లలు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ యమహా ట్రాక్ డే ఈవెంట్