Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబూ నిజాలు తెలుసుకుని మాట్లాడండి.. పయ్యావుల అసహనం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాను ఏకాంతంగా మాట్లాడటాన్ని చంద్రబాబు తప్పుబట్టడాన్ని పయ్యావుల జ

చంద్రబాబూ నిజాలు తెలుసుకుని మాట్లాడండి.. పయ్యావుల అసహనం
, బుధవారం, 11 అక్టోబరు 2017 (08:58 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాను ఏకాంతంగా మాట్లాడటాన్ని చంద్రబాబు తప్పుబట్టడాన్ని పయ్యావుల జీర్ణించుకోలేక పోవడమే కాదు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇదే అంశంపై పయ్యావుల మాట్లాడుతూ, ఈ విషయంలో చంద్రబాబుకు సరైన సమాచారం అందలేదని, అందువల్లే తాను మాటలు పడాల్సి వచ్చిందని ఇతర టీడీపీ నేతల వద్ద ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. జరిగిన ఘటనలో తన తప్పేముందని ప్రశ్నించారు. 
 
పరిటాల శ్రీరామ్ పెళ్లికి అందరిలాగానే తాను కూడా ఓ అతిథిగా వచ్చానని, కేసీఆర్ కనిపిస్తే, ఓ నమస్కారం పెట్టి వెళ్లిపోయానన్నారు. తనతో వచ్చిన ఓ ఉన్నతాధికారిని పంపి నన్ను పిలిపించగా, వెళ్లకుంటే బాగుండదన్న ఉద్దేశంతో కేసీఆర్ దగ్గరికి వెళ్లినట్టు వివరించారు. ఆ తర్వాత సీఎం కేసీఆరే స్వయంగా తన చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి మాట్లాడారని గుర్తు చేశారు. తానేమీ స్వయంగా వెళ్లి ఏకాంత భేటీలు జరపలేదన్నారు. చెయ్యని తప్పుకు మాటపడటం బాధను కలిగించిందని వాపోయారు. 
 
తెలంగాణ ప్రాంతానికి చెందిన రేవంత్, రమణలు చంద్రబాబుతో సమావేశమై ఈ అంశాన్ని ప్రస్తావన తెచ్చారన్నారు. ఈ తరహా చర్యల ద్వారా కింద స్థాయిలో కార్యకర్తలకు సమాధానం చెప్పలేకపోతున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి రాజీనామా మినహా మరో మార్గం తమ ముందు ఉండబోదని తన సహచరుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఇరు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉందనీ, ఇరు రాష్ట్రాల టీడీపీ నేతలకు ఆయనే పెద్ద అని అలాంటపుడు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరెస్సెస్‌లోని మహిళలు నిక్కర్లు ధరించడం చూశారా?: రాహుల్ గాంధీ