Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలనాటి రచనల డిజిటలైజేషన్‌కు పవన్ సాయం

అలనాటి రచనల డిజిటలైజేషన్‌కు పవన్ సాయం
, సోమవారం, 16 మార్చి 2020 (08:40 IST)
రాజమహేంద్రవరంలో పేరుగాంచిన గౌతమీ గ్రంథాలయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సంద‌ర్భంగా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

గ్రంథాలయ కార్యాలయంలో ఘనాపాటి, పండితులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, నారాయణరావు, రంగనాథ్ తదితరులతో ముచ్చటించారు. గ్రంథాలయంలో ఉన్న తాళపత్ర గ్రంథాలను, రాగి రేకుల మీద వేసిన శాసనాలను, 1771 కాలంలో ప్రచురితమైన పుస్తకాలు, సంస్కృత బైబిల్‌ను పవన్ ఆసక్తిగా తిలకించారు.

తాళపత్రాలు రచించే ఘంటాన్ని పరిశీలించారు. ఘంటంతో లిఖించే విధానాన్ని అక్కడ పండితులను అడిగి తెలుసుకున్నారు. శిష్టా ఆంజనేయశాస్త్రి పుస్తకాల‌పై వాకబు చేశారు. మాటల సందర్భంలో గ్రంథాలయ డిజిటలైజేషన్ ప్రక్రియ గురించి నిర్వాహకులు వివరించారు.

చారిత్రక పుస్తకాలను భవిష్యత్ తరాలకు అందించే ఈ ప్రక్రియ తమకు శక్తికి మించిన భారంగా మారిందని తెలిపారు. డిజిటలైజేషన్ వివరాలు తెలుసుకున్న పవన్ అందుకు అయ్యే మొత్తం తాను భరిస్తానని మాటిచ్చారు.

ఈ సందర్భంగా విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి శాలువా కప్పి పవన్‌ను  సత్కరించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యుడు కందుల దుర్గేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరించండి: డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు