Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆన్లైన్ క్లాస్ గ్రూప్‌లో నీలి చిత్రాలు - షాకైన విద్యార్ధినీవిద్యార్ధులు

ఆన్లైన్ క్లాస్ గ్రూప్‌లో నీలి చిత్రాలు - షాకైన విద్యార్ధినీవిద్యార్ధులు
, సోమవారం, 17 ఆగస్టు 2020 (23:15 IST)
కర్నూలు జిల్లా పత్తికొండలో రెచ్చిపోతున్న ఆకతాయిలు. అడ్డు అదుపు లేకుండా పోతుందన్న విద్యార్థినిల తల్లిదండ్రులు. ఇంతకీ మేటర్ ఏంటంటే... కరోనా పుణ్యమా అంటూ స్కూళ్లు మూతపడ్డాయి. ఆన్ లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. అయితే... ఈ ఆన్లైన్ క్లాసులు వలన ఎంత నేర్చుకుంటున్నారు అనేది పక్కన పెడితే... ఆన్లైన్ క్లాసుల కోసం ఏర్పాటు చేసిన గ్రూపులో నీలిచిత్రాల వీడియో పోస్టులు విద్యార్థులలో కలకలం రేపుతున్నాయి.
 
ఈ విషయం విద్యార్థుల నుంచి అలాఅలా.. బయటకొచ్చింది. దీంతో.. గ్రూపులో నీలి చిత్రాల వీడియోలు పోస్ట్ చేసిన వ్యక్తులపై చర్య తీసుకోవాలని AISF విద్యార్థి సంఘం నాయకులు ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా చేసారు.
 
వివరాల్లోకి వెళితే... పత్తికొండ ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థుల ఆన్లైన్ క్లాసులకు సంబంధించి టీజర్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసారు.
 
వాట్సాప్ గ్రూప్‌లో నీలి చిత్రం వీడియో పోస్ట్ విద్యార్థులలో కలకలం రేపింది. ఇలా ఇప్పటికే రెండుమూడు సార్లు జరిగింది. ఈ నీలిచిత్రాల వీడియోలు పోస్టులు బాలికల విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయడంపై AISF విద్యార్థి సంఘం నాయకులు పత్తికొండలో ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
 
నీలి చిత్రాలను పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని, గ్రూప్ అడ్మిన్లుగా ఉన్న టీచర్లు ఇలాంటి పోస్టులపై స్పందించకపోవడం వలన టీచర్లపై కూడా చర్య తీసుకోవాలని ఎంఈఓకు విద్యార్ధి సంఘం నాయకులు ఫిర్యాదు చేసారు. పిల్లలు ఆన్లైన్ క్లాసులు తల్లిదండ్రుల ఫోన్ నుంచే వింటున్నారు. ఏ విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్ నుంచైనా ఈ నీలిచిత్రాల వీడియోలు వచ్చాయా...? లేక ఎవరైనా కావాలనే నీలి చిత్రాలను ఈ గ్రూపులో పోస్ట్ చేసారా అనేది తెలియాల్సివుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 82 మందిని పొట్టనబెట్టుకున్న కరోనావైరస్