Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజల ప్రాణాలను హరిస్తున్న చింతా రెడ్డిపాలెం సెంటర్

ప్రజల ప్రాణాలను హరిస్తున్న చింతా రెడ్డిపాలెం సెంటర్
, సోమవారం, 18 నవంబరు 2019 (15:35 IST)
ప్రజల ప్రాణాలను హరిస్తున్న చింతా రెడ్డిపాలెం సెంటర్ జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలి సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. సీపీఎం పార్టీ 16 డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నేషనల్ హైవే సింహపురి హాస్పిటల్ సెంటర్ దగ్గర ప్రజలు ప్రాణాలు కాపాడండి అంటూ 16వ డివిజన్ ప్రజలతో కలిసి నిరసన తెలియజేశారు.
 
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ చింత రెడ్డి పాలం పాలం పాలం గ్రామాలనుండి నెల్లూరు నగరంలోకి జీవనోపాధికై ప్రతిరోజు వందలాది మంది పేదలు జాతీయ రహదారి ఏర్పడకముందే నుండి రాకపోకలు సాగిస్తూ ఉండేవారని జాతీయ రహదారి నిర్మాణం తర్వాత ఈ ప్రాంత ప్రజలు అండర్ బ్రిడ్జి నిర్మించడంతో ఈ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారిందని జాతీయ రహదారి నిర్మించిన అప్పటి నుండి అతివేగం వల్ల వచ్చే వాహనాల కారణంగా సుమారు 150 మంది వరకు జాతీయ రహదారి దాటే క్రమంలో ప్రాణాలు ప్రమాదాలకు గురై తమ ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అదేవిధంగా జిల్లా నలుమూలల నుంచి సింహపురి హాస్పిటల్‌కి ఇక్కడ రోగులు నిరంతరం వస్తుంటారని నారాయణ హాస్పిటల్ అదేవిధంగా విద్యా సంస్థలు ఈ బైపాస్ హైవే నుంచే దాటాల్సిందే పరిస్థితిని ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ నెల్లూరు నగరంలో నాలుగు చోట్ల ఫ్లైఓవర్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు మినిస్టర్ అనిల్ యాదవ్ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వారిని కూడా కలిసి తమ సమస్యలను కూడా వాళ్లకు వివరించి అర్జీలు కూడా ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రం ఏమైనా నీ అబ్బ జాగీరా? నాని.. ఏంది నీ భాష : బీద రవిచంద్ర