కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎక్కడపడితే మహిళలను వేధిస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో అఘాయిత్యం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం వుంటున్న ఓ మహిళా వీఆర్వోను ఓ ఎమ్మార్వో కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆమెకు అభ్యంతరకరమైన మెసేజ్లు పెడుతూ వేధించే వాడని.. 'మీ ఇంటికొస్తా, అడిగింది ఇస్తావా? కోడికూర వండిపెడతావా?' అంటూ అతడు మెసేజ్లు పెట్టాడు. దీంతో బాధితురాలిని వేధింపులకు గురిచేశాడు. అంతేగాకుండా.. బుధవారం రాత్రి, ఈ ఎమ్మార్ఓ బరితెగించి మహిళా వీఆర్ఓ ఇంటికి వెళ్లాడు.
షర్ట్ విప్పి, తన కోరిక తీర్చాలంటూ ఆమెపై బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ ఘటన గురించి తెలుసుకున్న వీఆర్ఓ తల్లి సమయస్ఫూర్తితో స్పందించి, ఆ ఎమ్మార్ఓను చితకబాదింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.