Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంత్రి పెద్దిరెడ్డిని తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: కొమ్మారెడ్డి పట్టాభిరామ్

మంత్రి పెద్దిరెడ్డిని తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
, గురువారం, 28 జనవరి 2021 (11:33 IST)
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని, ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు విరుద్ధంగా ఆయన మాటలున్నాయని, న్యాయవ్యవస్థ ఇచ్చిన తీర్పుని జీర్ణించుకోలేని వ్యక్తి మాటల్లానే పెద్దరెడ్డి వ్యాఖ్యలున్నాయని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా ...! 
 
రాజ్యాంగప్రక్రియకు విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా న్యాయస్థానాల తీర్పుని ధిక్కరించేలా మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. రాజ్యాంగవిరుద్ధంగా మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆయన్ని కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. 
 
హైకోర్టుఇచ్చిన తీర్పుని ఉల్లంఘించిన కారణంగా ఎస్ఈసీ కొందరు అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని  తప్పుపడుతూ, సదరు అధికారులను తిరిగి వారివిధుల్లోకే తీసుకుంటామని మంత్రిపెద్దరెడ్డి చెప్పడం ముమ్మాటికీ రాజ్యాంగవిరుద్ధమే అవుతుంది. అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకోవడమంటే, రివర్స్ టెండరింగ్ అని మంత్రి పెద్దిరెడ్డి అనుకుంటున్నాడా? రాజ్యాంగంతో కూడుకున్న వ్యవహారమని తెలుసుకోండి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలను రివర్స్ చేస్తాను, నా ఇష్టానుసారం చేస్తానని అనుకుంటే రాజ్యాంగం, న్యాయస్థానాలు, చట్టాలు ఒప్పుకోవని పెద్దిరెడ్డి అర్థంచేసుకోవాలి. 
 
జనవరి 12న హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ప్రభుత్వం ఏమని అఫిడవిట్ ఇచ్చిందో తెలుసా? ఎన్నికల విధులకుసంబంధించి ఏ మనిచెప్పారు? జనవరి 22వతేదీకల్లా, అప్ డేటెడ్ ఓటర్లజాబితాను  సమర్పిస్తామని చెప్పలేదా?  ఆనాడు అలాచెప్పిన మీరు, ఎన్నిక ల నిర్వహణకు అతికీలకమైన ఓటర్లజాబితాను ఎందుకుతొక్కిపెట్టా రో చెప్పాలి. ఆ విధంగా చేయడం హైకోర్టు తీర్పుని ధిక్కరించడం కాదా?

హైకోర్ట్ చీఫ్ జస్టిస్ తన తుదితీర్పులో ప్రభుత్వం చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు కూడా. సవరించిన ఓటర్లజాబితాను, ప్రభుత్వం కోర్టుకి , ఎస్ఈసీకి సమర్పించకపోవడం వల్ల,  3లక్షల 60వేలమంది ఓటర్లు తమఓటుహక్కుని కోల్పోయారు. అంతటి పెద్ద నేరానికి పాల్పడినవారిపై ఎన్నికలకమిషనర్ చర్యలుతీసుకుం టే, దాన్ని తప్పుపడతారా. ప్రభుత్వంలో పనిచేసి ఇద్దరు అధికారు లు రాజ్యాంగవిరుద్ధంగా ప్రవర్తించినందుకు, వారిపై ఎస్ఈసీ చర్యలు తీసుకుంటే, వారిని రివర్స్ చేస్తామని పెద్దిరెడ్డి చెప్పడం కోర్టు ధిక్కర ణ కిందకే వస్తుంది.

రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేయాలనే ఆలోచనల్లోంచి మంత్రి పెద్దిరెడ్డి ఇంకా బయటకువచ్చినట్లు లేరు. అధికారులను రివర్స్ చేస్తామని చెప్పడం ద్వారా పెద్దిరెడ్డి మంత్రి పదవికి అనర్హుడు, సదరు అధికారులపై ఒత్తిడితెచ్చి, 3లక్షల60వే ల మందికి ఓటుహక్కుని దూరంచేసిన వ్యక్తి మంత్రిగా కొనసాగడా నికి పనికిరాడు. పెద్దిరెడ్డికి ఏం అర్హత ఉందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుని అగౌరవపరిచేలా మాట్లాడాడు.  

పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్ఈసీ తప్పనిసరిగా రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి. ఏడాదిక్రితం బలవంతపు ఏకగ్రీవాలపేరుతో ప్రభుత్వం చేసిన అరాచ కాలు ప్రజలకు తెలియవనుకుంటున్నారా? మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో  తంబళ్లపల్లి, పుంగనూరు నియోజకవర్గాల్లో జరిగిన ఏకగ్రీవాలు ఎంతటి హింసాయుతంగా సాగాయో అందరికీ తెలుసు.

మంత్రి ఇలాఖాలో జులుమని, ప్రతిపక్షపార్టీ అభ్యర్థులను తరిమేశారని, రెండోరోజూ మంత్రి నియోజకవర్గంలో ఆగని అధికార పార్టీ దౌర్జన్యాలు,పుంగనూరులో చించేసిన నామినేషన్ పత్రాలు, అరాచకరాజ్యం సృష్టించారని పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో రాశారు. ఇటువంటి విద్యలన్నీ రామచంద్రారెడ్డికి వెన్నతో పెట్టిన విద్యలే కదా. పుంగనూరులో ఆరు జడ్పీటీసీలుంటే అన్నీ ఏకగ్రీవమే. 69 ఎంపీటీసీస్థానాలకు 65ఏకగ్రీవాలు, తంబళ్లపల్లిలో 6 జడ్పీటీసీలుంటే, ఆరు ఏకగ్రీవమే.

71 ఎంపీటీసీలుంటే, 71 స్థానాలు ఏకగ్రీవాలు. నూటికి నూరుశాతం ఏకగ్రీవాలు ఎలా సాధ్య మయ్యాయో పెద్దిరెడ్డి చెప్పాలి. ముఖ్యమంత్రిని మించిపోయి మరీ పెద్దిరెడ్డి రౌడీయిజం చెలాయించాడని ఈ ఏకగ్రీవాలే చెబుతున్నా యి. ఆనాడు అలాచేసిన పెద్దిరెడ్డి, నేడు పంచాయతీ ఎన్నికల్లో కూడా అలానే చేయాలని భావిస్తున్నట్లున్నారు. ప్రజల ఇదివరకటి లా లేరని, వారిలోచైతన్యం పెరిగిందని ఆయన తెలుసుకుంటే మంచిది. వైసీపీని తరిమికొట్టడానికి వారంతా సిద్ధంగా ఉన్నారని మంత్రి గ్రహించాలి.  వైసీపీ పతనం పుంగనూరు నుంచే టీడీపీ మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉంది. 
 
సాక్షిపత్రికసహా, అనేక దినపత్రికల్లో నేడుఏకగ్రీవాలకు సంబంధించి ప్రకటనలు ఇచ్చారు. ఆప్రకటనల్లో వేసిన సచివాలయ చిత్రం లోగో ఏదైతే ఉందో అది తెలంగాణకు చెందినది. పొరుగు రాష్ట్రానికి చెందిన లోగోను పత్రికల్లో ప్రచురించిన ఈ గుడ్డిప్రభుత్వ నిర్వాకం ప్రజలంతా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక తెలంగాణాకా?

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పంచాయతీ కార్యా లయ చిత్రాన్ని ఏపీకి చెందిన పత్రికాప్రకటనల్లో ప్రచురించడం ఏమిటి? జగన్మోహన్ రెడ్డికి కళ్లు మూసుకున్నా, తెరిచినా తెలంగా రాష్ట్రం, ఆరాష్ట్రంలో దాచుకున్న తనకు చెందిన వేలకోట్లు గుర్తుకు వస్తున్నట్లున్నాయి. వందలకోట్ల ప్రజాధనాన్ని తగలేసి, కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తోందా ఏపీకి చెందిన ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంటు?

ఇంతబాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినందుకు సమాచార ప్రసారశాఖామంత్రి పేర్నినానీపై చర్యలు తీసుకోవాలి. ప్రకటనలకు వెచ్చించిన మొత్తం సొమ్ముని ఆయన నుంచే వసూలుచేయాలి. చట్టవిరుద్ధంగా, హైకోర్ట్ తీర్పుకి విరుద్ధంగా మాట్లాడిన మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.  

ఏకగ్రీవాల పేరుతో ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడితే టీడీపీ చూస్తూ ఊరుకోదు. సంవత్సరం క్రితం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పుడు ప్రభుత్వం ఎంతలా బరితెగించి బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడిందో,   ఆపరిస్థితుల ను కూడా ఎస్ఈసీకి వివరించాము.  ప్రభుత్వం ఇప్పుడు పంచాయతీల ఏకగ్రీవాలకు సంబంధించి ఇచ్చిన ప్రోత్సాహకాలు గతంలోకిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినవే. 

అప్పుడు ఇచ్చిన ప్రోత్సాహకాలకంటే ఇప్పుడు ఇంకా తగ్గించారు.  గ్రామస్థులంతా కలిసి ఒకేమాటపై నిలిచి పోటీలేకుండా పంచాయతీలో సర్పంచ్ ను ఎన్నుకుంటే కనిష్టంగా రూ.7లక్షలనుంచి గరిష్టంగా రూ.20లక్షల వరకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏకగ్రీవాలైన పంచాయతీలకు ప్రోత్సాహకంనగదు కింది కనీసంగా ఇచ్చే రూ.7లక్షల మొత్తాన్ని జగన్ ప్రభుత్వం  ఇప్పడు రూ.5ల క్షలకు తగ్గించింది. ఉన్నదానిలో కోతపెట్టి ఇంకాఏదోచేసినట్లు సిగ్గులేకుండా ప్రచారం చేసకుంటున్నారు. 

ఏకగ్రీవాలముసుగులో వైసీపీ రౌడీమూకలు గ్రామాల్లోకి వస్తే, ప్రజలుతరమితరిమి కొట్టడానికి సిద్ధంగాఉన్నారు. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోకూడా మంత్రిపెడ్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అరాచకాలను తగ్గించుకుంటే మంచిది. అధికారులను రివర్స్ చేస్తానంటూ రామచంద్రారెడ్డి మాట్లాడిన మాటలపై ఎన్నికలకమిషనర్ కు ఫిర్యాదు చేశాం. ఆయన్ని బర్తరఫ్ చేసేవరకు టీడీపీ వదిలిపెట్టదని కూడా తేల్చి చెబుతున్నాను. 

ఎవరు ఎవరికి ఓటేశారో తెలుస్తుందని బెదిరించ డంద్వారా  ఏం చెప్పాలనుకుంటున్నారు. పోలింగ్ బూత్ లలోకి వెళ్లి నించుని ఓటేసినవారిని బెదిరిస్తారా? ప్రతి టీడీపీ కార్యకర్త సైనికుడిలా పనిచేసి, వైసీపీ రౌడీయిజాన్ని తరిమికొట్టడానికి సిద్ధం గా ఉన్నాడని తెలియచేస్తున్నా. వైసీపీ ప్రభుత్వం, ఆపార్టీనేతలు ఒళ్లుదగ్గరపెట్టుకొని పనిచేస్తే వారికే మంచిది. ఎన్నికలకమిషన్ స్వేచ్ఛాయుతంగా, శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని టీడీపీతరుపున విజ్ఞప్తిచేస్తున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాలా లజపతి రాయ్ పుట్టిన రోజు: పంజాబ్ కేసరి.. అతివాద రాజకీయాలను..?