Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి బ్రహ్మూత్సవాలకు రాజనాధ్‌ కు ఆహ్వానం

శ్రీవారి బ్రహ్మూత్సవాలకు రాజనాధ్‌ కు ఆహ్వానం
, శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (08:04 IST)
కలియుగ దైవమైన శ్రీవారి అఖిలాండ బ్రహ్మూత్సవాలను తిలకించాలని గురువారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాధ్‌ సింగ్‌కు ఢిల్లీలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ సందర్భంగా టీటీడీలో చేపడుతున్న సంస్కరణలను మంత్రి కొనియాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుమలకు రావడం ఆనందదాయకమన్నారు.

హైందవ సంప్రదాయాలను కాపాడుతూ ప్రజల్లో భక్తి ప్రపత్తులను ప్రోది చేస్తున్న టీటీడీ నిర్ణయాలను ఆయన అభినందించారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులతో జీవిస్తారని రాజ్‌నాధ్‌ సింగ్‌ వ్యక్తం చేశారు.

దేవదేవుని ఆశీస్సులు ప్రజలందరికీ అందించేందుకు చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డికి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సుబ్బారెడ్డి వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం