Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాదులో దారుణం.. కళ్లల్లో కారంకొట్టి కత్తులతో పొడిచేశారు..

హైదరాబాదులో దారుణం.. కళ్లల్లో కారంకొట్టి కత్తులతో పొడిచేశారు..
, బుధవారం, 12 ఆగస్టు 2020 (20:36 IST)
హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కిరాణా షాపు యజమాని కళ్లల్లో కారంకొట్టి కత్తులతో పొడిచేశారు. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్‌కి చెందిన అంజన్ రెడ్డి స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. గుర్తుతెలియని దుండగులు అంజన్‌పై హత్యాయత్నం చేశారు. దుకాణంలో చొరబడిన దుండగులు అంజన్ కళ్లలో కారం కొట్టి.. కత్తులతో విచక్షణా రహితంగా పొడిచేశారు. 
 
చేతులు, మెడపై కత్తిగాట్లున్నాయి. గొంతుకోసి పరారైనట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన బాధితుడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఊరి నుంచి ఇంటికి వచ్చేశారు. 
 
ఇంటికి తాళం వేసి ఉండటంతో దుకాణం వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. దుకాణానికి తాళం వేయకపోవడంతో షట్టర్ తీసి రక్తపు మడుగులో పడి ఉన్న అంజన్‌ని చూసి షాక్‌కి గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూజిలాండ్‌లో 102 రోజుల తర్వాత కరోనా కేసులు.. మళ్లీ ఆంక్షలు