Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య కాపురానికి రావట్లేదని టెక్కీ సూసైడ్.. ఎక్కడ?

భార్య కాపురానికి రావట్లేదని టెక్కీ సూసైడ్.. ఎక్కడ?
, శుక్రవారం, 21 డిశెంబరు 2018 (08:58 IST)
హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కట్టుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, జియాగూడ క్రాంతిభవన్‌కు చెందిన జి. కమలేష్ (40), శ్రీవిద్య అనే దంపతులు ఉన్నారు. వీరికి పదేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. కమలేష్ హైటెక్ సిటీలోని ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. 
 
అయితే, గత మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో శ్రీవిద్య పుట్టింటికి తన కుమారుడుతో కలిసి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాపురానికి రావాలంటూ కమలేష్ పలుమార్లు భార్యను కోరాడు. కానీ, ఆమెవైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మనస్తాపం చెందిన కమలేష్ తన ఇంట్లోని పడకగదిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. 
 
గత నాలుగు రోజులుగా కమలేష్‌ ఉంటున్న ఇంటి తలుపులు తీయకపోవడం, ఇంటి ముందు నాలుగు రోజుల పేపర్లను గమనించిన స్థానికులు తలుపులను తెరిచేందుకు ప్రయత్నించారు. తలుపు గడియ వేసి ఉండటంతో గడియ పగులగొట్టి చూసే సరికి బెడ్‌ రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో స్థానికులు కుల్సూంపుర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యూటీషియన్ కోర్చు నేర్పిస్తానని బాలికలతో వ్యభిచారం...