Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్నేహితుడిని చూసేందుకు వెళితే... పట్టుకుని అత్యాచారం చేశారు...

స్నేహితుడిని చూసేందుకు వెళితే... పట్టుకుని అత్యాచారం చేశారు...
, శుక్రవారం, 23 ఆగస్టు 2019 (09:25 IST)
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తన స్నేహితుడిని చూసి మాట్లాడి వచ్చేందుకు వెళితే ముగ్గురు కామాంధులు కలిసి ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణం చిత్తూరు జిల్లా కురబలకోటలో జరిగింది. ఈ నెల 3వ తేదీన ఈ దారుణం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కురబలకోట మండల కేంద్రానికి చెందిన ఓ యువతి ఇంజనీరింగ్ చదువుతోంది. ఆమె ఈ నెల 3వ తేదీ సాయంత్రం తన స్నేహితుడిని కలిసేందుకు హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లింది. 
 
ఆమె తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో అదే ప్రాంతానికి కొందరు యువకులు మద్యం సేవించేందుకు వచ్చారు. ఈ తాగుబోతు యువకులు ఆ యువతిపై కన్నేసి.. దాడి చేశారు. ఆమె స్నేహితుడిని కొట్టి బెదిరించి అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం ముగ్గురూ కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో ఆ యువతి మిన్నకుండిపోయింది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆ యువతి అనారోగ్యానికి గురికావడంతో అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత వారంతా కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యాచారానికి పాల్పడిన కమతంవారిపల్లెకు చెందిన అష్రఫ్, జయచంద్ర, మస్తాన్‌వల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్యోతిసురేఖ క్రీడల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.. ఏపీ మంత్రులు