Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్నిపై తీర్పు రిజర్వు

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్నిపై తీర్పు రిజర్వు
విజయవాడ , బుధవారం, 11 ఆగస్టు 2021 (10:03 IST)
స్వ‌తంత్రుల‌కే ఎన్నిక‌ల క‌మిష‌న్ అధికారాలు ఇవ్వాల‌ని, హైకోర్టులో ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ పూర్తైంది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్​ అధికారి నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ,  దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. 
 
నీలం సాహ్నిని ఎస్​ఈసీ గా నియమించడాన్నిసవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా ఉండే వ్యక్తిని ఎస్​ఈసీగా నియమించాలని సుప్రీంకోర్టు గ‌తంలో తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. 
 
ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రి సలహాదారుగా పనిచేసినందున నీలం సాహ్ని స్వతంత్ర ఎస్​ఈసీ కాదని, పిటిషనర్ తరఫు న్యాయవాది శశిభూషణ్ రావు వాదనలు వినిపించారు. నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేయాలన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.





Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు గూగుల్ షాకింగ్ న్యూస్.. ఏంటది?