Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు

పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు
, ఆదివారం, 21 నవంబరు 2021 (16:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఉన్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళ సమయంలో కార్మికులు అప్రమత్తంగా ఉండి అక్కడ నుంచి బయటకు వెళ్లిపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. 
 
ఈ జిల్లాలోని యాడికిలో పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలోని బొగ్గుతో మండే గొట్టం వేడి పెరగడంతో పేలుడు ఒక్కసారిగా సంభవించింది. 
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇందులో పనిచేసే కార్మికులంతా టీ తాగేందుకు బయటకు వెళ్లివున్నారు. దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూఎస్ రోడ్లపై కరెన్సీ నోట్లు... షాకైన జనాలు... ఏరుకునేందుకు..