ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగంలో ఉన్న రేషన్ కార్డులకు ఈకేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. అయితే, చాలా మంది ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదు. ఇలాంటి వారికి ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఈ కారణంగా వారికి రేషన్ బియ్యం ఇవ్వంటూ ప్రచారం సాగింది. దీంతో ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసే గడువును ఏపీ ప్రభుత్వం పొడగించింది.
చిత్తూరు జిల్లాలో 1379 చౌక దుకాణాలుండగా అందులో 5.36 లక్షల కార్డులు, 16.70 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీటిలో ఇంకా 1.12 లక్షల మంది 8-9 శాతం మంది వరకు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఇలాంటి వారు ఆన్లైనులో ఈకేవైసీ స్టేటస్ సొంతంగా తెలుసుకోవచ్చని పౌరసరఫరాల అధికారులు సూచిస్తున్నారు.
గూగుల్ వెబ్ బ్రౌజర్లో ఈపీడీఎస్-1 అని నమోదు చేసి ఎంటర్ నొక్కాలి. అపుడు డిపార్టుమెంట్ ఆఫ్ కన్స్యూమర్ ఎఫైర్స్ అండ్ సివిలి సప్లైస్ ఏపీ అనే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో డాష్ బోర్డును ఎంపిక చేసుకోవాలి. దానిలో బియ్యం కార్డు విభాగంలో ఆరు రకాల ఆప్షన్లు ఉంటే న్యూ అనే పేరుతో కనిపించే దానిపై క్లిక్ చేయాలి. ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్స్ లేదా రైస్ కార్డు సెర్చ్ అనే గుర్తుల్లో ఒకదానిని క్లిక్ చేసి బియ్యం కార్డు నంబరు నమోదు చేస్తే అందులో ఉన్న పేర్లు వస్తాయి.