Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తీగలాడితే డొంక కదులుతోందా? అచ్చెంనాయుడు కేసు తిరుపతిలోను?

Advertiesment
తీగలాడితే డొంక కదులుతోందా? అచ్చెంనాయుడు కేసు తిరుపతిలోను?
, శుక్రవారం, 12 జూన్ 2020 (21:19 IST)
2015 సంవత్సరం నుంచి టిడిపి హయాంలో ఉన్న సమయంలో కార్మిక శాఖామంత్రిగా అచ్చెంనాయుడు పనిచేశారు. ఆ సమయంలో ఇఎస్ఐ ఆసుపత్రికి సంబంధించి కుంభకోణం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఆ విచారణలో భాగంగా ఈరోజు ఉదయం అచ్చెంనాయుడును అరెస్టు చేశారు.
 
అయితే అచ్చెంనాయుడు అరెస్టు తరువాత తిరుపతిలోను మాజీ అధికారులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఎసిబి అధికారులు. టిడిపి హయాంలో ఇస్ఎస్ఐ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన రమేష్ కుమార్‌తో పాటు వైద్యుడిగా ఉన్న జనార్థన రావులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 
 
ఒక హైడ్రామా తిరుపతిలో నెలకొంది. తెల్లవారుజామున తిరుపతికి వచ్చిన విజయవాడ ఎసిబి ప్రత్యేక బృందం సరిగ్గా 9 గంటలకు అవిలాలోని రమేష్ కుమార్ ఇంటిక వెళ్ళారు. అక్కడ అయన్ను అదుపులోకి తీసుకుని అదే కారులో ఎయిర్ బైపాస్ రోడ్డుకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న వైద్యుడు జనార్థన్ రావును కారులో ఎక్కించుకుని విజయవాడకు తీసుకెళ్ళిపోయారు.
 
తిరుపతిలో ఇఎస్ ఐ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా పనిచేసిన రమేష్ కుమార్ విజయవాడలో పదోన్నతి మీద డైరెక్టర్ గా వెళ్ళారు. అప్పట్లో జరిగిన కుంభకోణంలో రమేష్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారన్నది ఎసిబి విచారణలో వెల్లడైంది. దీంతో విజయవాడలోనే విచారణ జరిపేందుకు తిరుపతి నుంచి తీసుకెళ్ళారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైరిస్క్ వారందరికీ కరోనా పరీక్షలు చేయండి: సిఎస్ నీలం సాహ్ని