Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాళిబొట్టు తీసుకొని నా భూమిని పట్టా చేయండి.. మహిళ నిరసన

తాళిబొట్టు తీసుకొని నా భూమిని పట్టా చేయండి.. మహిళ నిరసన
, బుధవారం, 30 జూన్ 2021 (17:41 IST)
Rudrangi Mandal
తాళిబొట్టు తీసుకొని తన భూమి తనకు పట్టా చేయాలని మహిళ నిరసన చేపట్టింది. ప్రస్తుతం ఈ ఘటన రుద్రంగి మండంలో సంచలనం సృష్టించింది. 
 
రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం మంగకు చెందిన సర్వే నెంబర్ 130/14లో గలా 2 ఎకరాల భూమిని తన భర్త  రాజేశం మూడు సంవత్సరాల క్రితం చనిపోగానే వేరే వాళ్ళకి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పట్టా చేశారని.. భూమి నాకు పట్టా చేయాలని మూడు సంవత్సరాలుగా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పింది. 
 
ఈ రోజు తన భర్త ఎలాగో లేడు అని తన తాళిబొట్టు తీసి ఆఫీస్ గేట్‌కి వేలాడదీసి ఈ తాళిబొట్టును లంచంగా తీసుకొని భూమి తనకు పట్టా చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.

బాధిత మహిళ ఉద్యోగ రీత్యా మెటపల్లిలో పని చేసుకుంటూ ఉండగా వేరే వళ్లు తన భూమిని మొక ఎంక్వైరీ చెపిచ్చుకొని పట్టి చేసుకున్నారని దానికి అధికారులు కూడా సహకరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు భర్త లేడని కనీసం తనకు ఆధారమైన ఇట్టి భూమినైన ఇప్పించాలని అధికారులను వేడుకుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వి.కె శశికళపై మరో కేసు.. మళ్లీ పార్టీలోకి అన్నాడీఎంకేలోకి ఎంట్రీ