Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాహసీల్దారుపై పెట్రోల్ పోసిన రైతు.. ఎందుకో తెలుసా?

తాహసీల్దారుపై పెట్రోల్ పోసిన రైతు.. ఎందుకో తెలుసా?
, మంగళవారం, 29 జూన్ 2021 (15:52 IST)
కొందరు ప్రభుత్వ అధికారుల వైఖరితో విసిగిపోయిన పలువురు బాధితులు తిరగబడుతున్నారు. కొందరు క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా తాహసీల్దారు తాము చేస్తున్న ఆందోళనను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన  రైతు.. అతనిపై పెట్రోల్ పోశాడు. దీంతో అక్కడు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని తాళ్లపల్లి తండాలో మాలోత్ బాలు అనే రైతు పొలం వద్ద విద్యుదాఘాతంతో చనిపోయాడు. అయితే, శివ్వంపేట తహసీల్దార్ భాను ప్రకాశ్.. బాలుకు సకాలంలో పట్టాదార్ పాసుపుస్తకాలను ఇవ్వలేదని, దీంతో బాలుకు రైతు బీమా రాదని స్థానిక రైతులు ఆరోపించారు.
 
వారంతా కలిసి బాలు మృతదేహంతో శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చారు. మృతదేహంతో ఆఫీసు ముందు ఆందోళన చేశారు. కొందరు రైతులు తమ వెంట డీజిల్ బాటిళ్లనూ తీసుకువచ్చారు. 
 
ఇంత ఆందోళన చేస్తున్నా తహసీల్దార్ పట్టించుకోవట్లేదని ఆక్రోశంతో ఆయనపై ఓ రైతు డీజిల్ పోశాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆఫీసు దగ్గరకు వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
 
కాగా, రెండేళ్ల క్రితం రాష్ట్రంలో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఓ రైతు నేరుగా ఆఫీసులోకి వెళ్లి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో తీవ్రమైన కాలిన గాయాలతో ఆమె మరణించారు. ఆమెను కాపాడబోయిన డ్రైవర్ కూడా ఆ తర్వాత చనిపోయాడు. ఈ నేపథ్యంలోనే తాజా ఘటన కలకలం రేపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రాన్స్ జెండర్స్‌కి ఉచిత విద్య.. పాఠశాల ఏర్పాటు