Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 19 February 2025
webdunia

ఆ 711 మంది ఉద్యోగులను తెలంగాణకు పంపేయండి: సీఎం జగన్

Advertiesment
ఆ 711 మంది ఉద్యోగులను తెలంగాణకు పంపేయండి: సీఎం జగన్
, బుధవారం, 31 మార్చి 2021 (23:30 IST)
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు సంబంధించిన దాదాపు 700 మందికి పైగా క్లాస్ 3 క్లాస్ 4 ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించబడ్డారు. ఈ ఉద్యోగులు అందరూ కూడా తమను తమ రాష్ట్రానికి పంపాలని గత ఐదారు సంవత్సరాలుగా కోరుతూనే ఉన్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదటి సమావేశంలో ఈ ఉద్యోగుల అంశాన్ని అజెండాలో చేర్చి తెలంగాణ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది.

తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపై సానుకూలంగా స్పందించి తెలంగాణ నేటివిటి కలిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న 711 మంది ఉద్యోగులను అక్కడి ప్రభుత్వంలో తీసుకోవడానికి అంగీకారం తెలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం కోసం ఇక్కడికి లేఖ రాయడం జరిగింది. ఈ విషయంపై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరుపున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి 711 మంది క్లాస్ 3, క్లాస్ 4 తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు పంపుటకు ఆమోదం తెలుపవలసిందిగా కోరడం జరిగింది.

దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ రోజే ఆమోదం తెలిపి ఈ రోజే ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారిని ఆదేశించడం జరిగింది. అడిగిన వెంటనే తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రానికి పంపడానికి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరుపున సచివాలయ ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
 
అలాగే పంచాయతీరాజ్ శాఖ లోని అన్ని సంఘాలు అన్ని ఉద్యోగులను కలుపుతూ కొత్తగా ఏర్పడిన పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సీఎం గారికి పరిచయం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంపీడీవో ప్రమోషన్ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని సీఎం గారిని కోరగా సీఎం గారు సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా ఎంపిడివోలు ప్రమోషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు అని వెంకట్రాంరెడ్డి, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికపై అత్యాచారం, ప్రశ్నించిన తల్లి, నాన్నమ్మలపై కామాంధుడు దాడి