Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో లాక్‌డౌన్.. రాత్రి పూట కర్ఫ్యూ?

తెలంగాణలో లాక్‌డౌన్.. రాత్రి పూట కర్ఫ్యూ?
, మంగళవారం, 23 మార్చి 2021 (11:03 IST)
తెలంగాణ రాష్ట్రంపై మరోమారు కరోనా పంజా విసురుతోంది. నెలరోజులుగా మహమ్మారిబారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 15 రోజుల నుంచి రోజుకు 3 వందలకుపైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. అందులో దాదాపు సగానికిపైగా కేసులు రాష్ట్రంలోని గురుకులాల్లలోనే కావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధిస్తారనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణలో లాక్ డౌన్.. రాత్రిపూట కర్ఫ్యూ..? కేసుల సంఖ్య తగ్గాలంటే లాక్ డౌన్ తప్పదా? ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నారా? దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వారం నుంచి అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

కొన్ని నెలల తర్వాత ఒక్కసారిగా కేసులు పెరుగుతుండడంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించడంతోపాటు రాత్రి పూట కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో కూడా కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్.. కర్ఫ్యూ విధిస్తారని ప్రచారం జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ ఉక్కును తెగనమ్మడం ఖాయం : కేంద్రం స్పష్టీకరణ