Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్, హోలీ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించే యోచనలో కేజ్రీవాల్‌

ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్, హోలీ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించే యోచనలో కేజ్రీవాల్‌
, సోమవారం, 22 మార్చి 2021 (21:59 IST)
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. నవంబర్‌ నుంచి కోవిడ్‌ కేసులు తగ్గినప్పటికి.. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించగా.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ కూడా ఈ జాబితాలో చేరింది.
 
 రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించేందుకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం సిద్ధమయ్యింది. త్వరలో రానున్న హోలీ పండగ నేపథ్యంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు‌ కనిపిస్తున్నాయి. ఈ నెల 28న హోలీ ఉండటంతో.. కఠిన ఆంక్షలకు విధించాలని సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో మార్చి 28 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌ విధించాలని సూచించారు అధికారులు.
 
ఇక ఢిల్లీలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 4,288 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో విపత్తు నిర్వహణ అథారిటీ కాసేపట్లో సమావేశం కానుంది. పెరుగుతున్న కోవిడ్ కేసులపై జరగనున్న చర్చించనుంది. ఈ సమావేశానికి లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంతో పాటు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశం తర్వాత లాక్‌డౌన్‌పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌ గురించి జనాలను హెచ్చరిస్తోంది. టీకా తీసుకోవాలని.. జాగ్రత్తలు పాటించాలని కోరుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో కూలిన గ్యాలరీ... పలువురికి గాయాలు