Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందుకే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ ప్రచారం జోలికెళ్లలేదు.. రోజా

Advertiesment
Roja
, బుధవారం, 12 డిశెంబరు 2018 (14:14 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ.. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి తెలంగాణ ప్రజలు మంచి బుద్ధి చెప్పారన్నారు. నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు సమాధి చేయాలనుకున్నారని రోజా ఆరోపించారు. కూకట్‌పల్లిలో సుహాసినిని పోటికి దింపి.. నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు రాజకీయంగా నాశనం చేయాలని ప్రయత్నించారని విమర్శలు గుప్పించారు. 
 
కూకట్‌పల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఘోరంగా ఓటమి పాలైన సంగతిని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుహాసిని తరపున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ రాలేదు. బాలకృష్ణ, తారకరత్న మాత్రమే ప్రచారాన్ని నిర్వహించారు. జూనియర్, కల్యాణ్ రామ్ ఇధ్దరూ బాబు కుట్రను ముందుగా పసిగట్టాకే ఎన్నికల ప్రచార బరిలోకి దిగలేదని రోజా అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్‌ది ఐరెన్ లెగ్గా... ప్రచారం చేసిన చోటల్లా కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి!