Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాస్తు దోషాలను తొలగించుకోవాలంటే.. స్వస్తిక్ వినాయకుడిని?

వినాయకుడి బొమ్మ తప్పకుండా ఇంట్లో లేదా ఆఫీసులో వుండాలి. వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహం లేదా ఫోటోని పెట్టుకోవడం వల్ల.. పాజిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుంది. సరైన దిశలో వినాయకుని విగ్రహాన్ని లేదా పటాన్ని

Advertiesment
Ganesha
, శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (18:21 IST)
వినాయకుడి బొమ్మ తప్పకుండా ఇంట్లో లేదా ఆఫీసులో వుండాలి. వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహం లేదా ఫోటోని పెట్టుకోవడం వల్ల.. పాజిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుంది. సరైన దిశలో వినాయకుని విగ్రహాన్ని లేదా పటాన్ని వుంచుకోవడం ద్వారా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.


వినాయకుడి బొమ్మ వాస్తు దోషాలను దూరం చేస్తుంది. ఇంట్లో వాస్తు దోషంతో బాధపడేవాళ్లు.. వినాయకుడు, స్వస్తిక్ కలిసి ఉండే విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి వాస్తు దోషమైనా తొలగిపోతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. 
 
అదే కార్యాలయాల్లో నిలబడి వుండే వినాయకుని విగ్రహాన్ని వుంచాలి. ఇలాంటి విగ్రహం వర్క్ ప్లేస్‌లో పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది. అలాగే కూర్చుని, తొండం ఆయన ఎడమ చేతివైపు తిరిగి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వుంచితే అదృష్టం వరిస్తుంది. విజయం మీ సొంతం అవుతుంది. ఇంకా సంతోషం, ప్రశాంతత, ఐశ్వర్యం పొందాలనుకునేవాళ్లు తెలుపు వర్ణంలోని వినాయకుడి విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి.
 
కానీ పూజ గదిలో కేవలం ఒక వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలి. రెండు లేదా అంత కంటే ఎక్కువ వినాయకుడి విగ్రహాలను వుంచకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇంకా ఆరెంజ్ లేదా ఎరుపు రంగుతో కూడిన వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే వ్యాపారాభివృద్ధితో పాటు సంపద పెరుగుతుందని వారు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకృష్ణుడిని అలా నాలుగుసార్లు పిలిస్తే చాలు..?