Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చివరి విమానం తిరిగొచ్చేవరకూ నిద్రపోని మోదీ... పాక్ పైన ఆస్ట్రేలియా కన్నెర్ర

Advertiesment
Surgical strike 2
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (22:00 IST)
జెఈఎమ్ టెర్రరిస్ట్ క్యాంపులపై భారతదేశ వాయుసేన సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు ఇండియన్ బేస్ నుంచి బయలుదేరిన దగ్గర్నుంచి అవి దాడి చేసి తిరిగి వచ్చేవరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలా చూస్తూ వున్నారట. చివరి విమానం పైలెట్ సురక్షితంగా భారతదేశంలో ల్యాండ్ అయిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇకపోతే పాకిస్తాన్ భూభాగం నుంచి పదేపదే భారతదేశంపై తీవ్ర వాదులు దాడి చేయడంపై ఆస్ట్రేలియా ఖండించింది. వెనువెంటనే తీవ్రవాద గ్రూపులపై పాకిస్తాన్ అర్థవంతమైన చర్య తీసుకుని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజాను ఓడించేందుకు ఆమెను రంగంలోకి దించుతున్న చంద్రబాబు.. ఎవరు?