Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త నుంచి విడాకులు కోరిన జైపూర్ రాజకుమారి

Advertiesment
Diya Kumari
, ఆదివారం, 9 డిశెంబరు 2018 (16:39 IST)
జైపూర్ రాజకుమారి విడాకులు కోరారు. తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. హిందూ వివాహ చట్టం 13బి సెక్షన్ ప్రకారం గాంధీ నగర్‌లోని కుటుంబ కోర్టులో ఆమె విడాకుల పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆమె పేరు దియా కుమారి. ఈమె కేవలం రాజకుమారిగానే కాకుండా సవాయి మాధోపూర్ ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు.
 
జైపూర్‌ మహారాజు భవానీ సింగ్‌ కుమార్తె అయిన దియా కుమారి నరేంద్ర సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు డేటింగ్‌ చేసిన ఈ జంట 1997లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా వీరి మధ్య  మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో 21 ఏళ్ల తర్వాత ఈ జంట విడిపోనున్నది. ఇందుకోసం కోర్టులో పిటిషన్ దఖాలు చేయగా, అందులో పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 
 
కాగా, గత ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ఆమె.. తాజాగా జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పోటీకి దూరంగా ఉన్నానని ప్రకటించడంతో ఆమె స్థానంలో ఆశా మీనా అనే కొత్త అభ్యర్థికి బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే లోక్‌సభ అభ్యర్థిగా దియాను రంగంలోకి దింపాలనే ఉద్దేశంతోనే బీజేపీ నాయకత్వం కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చినట్లుగా స్థానిక నేతలు అప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రిపుల్ తలాఖ్ చెప్పిన భర్త.. చెంప ఛెల్లుమనిపించిన భార్య