Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Advertiesment
Vijay Deverakonda, Suryadevara Naga Vamsi, Bhagyashree Borse

దేవీ

, బుధవారం, 30 జులై 2025 (16:25 IST)
Vijay Deverakonda, Suryadevara Naga Vamsi, Bhagyashree Borse
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన కింగ్‌డమ్’ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ముఖ్య పాత్రలు పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం పాత్రికేయుల సమావేశం నిర్వహించింది.
 
ఈ సందర్భంగా కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "సినిమా అవుట్ పుట్ పట్ల మేము చాలా సంతృప్తిగా ఉన్నాము. బుకింగ్స్ కి వస్తున్న అద్భుతమైన స్పందన చూసి మాకు సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న భరోసాతోనే.. మేము సినిమా విడుదల ముందు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. 'జెర్సీ' సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి 'కింగ్‌డమ్' ఇది. ఈ చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. చరిత్రలో ఏ యుద్ధం చూసుకున్నా.. కుటుంబం కోసమో, పుట్టిన నేల కోసమో, ప్రేమ కోసమో ఉంటుంది. ఈ యుద్ధం కూడా అలాంటిదే. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ప్రేక్షకులు 'కింగ్‌డమ్' ప్రపంచంలోకి వెళ్తారు. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం మంచి అనుభూతిని ఇస్తుంది." అన్నారు.
 
నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. "ఈమధ్య కాలంలో సినిమాలకు ఓపెనింగ్స్ రాబట్టడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఆ పరంగా చూస్తే మేము పాస్ అయ్యాము. బుకింగ్స్ బాగున్నాయి. మంచి వసూళ్లతో సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం కాదు. గౌతమ్ తిన్ననూరి శైలి ఎమోషన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. ఈ సినిమా కోసం సెట్స్ వేయలేదు. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్ లో షూట్ చేశాం. మా టీమ్ పడిన కష్టం మీకు తెర మీద కనిపిస్తుంది." అన్నారు.
 
కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. "కింగ్‌డమ్ లో మధు అనే కథకు కీలకమైన పాత్ర పోషించాను. గౌతమ్ గారు పాత్రను అద్భుతంగా మలిచారు. విజయ్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను." అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి