Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Advertiesment
vijay devarakonda - bhagyasri

ఠాగూర్

, ఆదివారం, 27 జులై 2025 (10:04 IST)
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో పాటు 'కింగ్డమ్' చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆపై తితిదే అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
webdunia
 
కాగా, శనివారం రాత్రి తరుపతిలో కింగ్డమ్ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో కథానాయికగా భాగ్య శ్రీ నటిస్తుండగా సత్యదేవ్ మరో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 31వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన