Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

Advertiesment
mahesh - priyanka

ఠాగూర్

, గురువారం, 13 మార్చి 2025 (15:15 IST)
ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న "ఎస్ఎస్ఎంబీ-29" చిత్రం షూటింగ్ వల్ల భవిష్యత్‌లో ఒరిస్సా సినిమా షూటింగులతో పాటు పర్యాటక రంగానికి ఒక గొప్ప గమ్యస్థానంగా మారుతుందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆమె గురువారం ఓ ట్వీట్ చేశారు. 
 
గతంలో మల్కాన్‌గిరిలో "పుష్ప-2" చిత్రం షూటింగ్ జరిగినట్టే, ఇపుడు ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోయే చిత్రం 'ఎస్ఎస్ఎంబీ-29' కోసం కోరాపుట్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక్ చోప్రా నటిస్తున్నారు. ఇది ఒరిస్సా పర్యాటక రంగానికి మంచి అవకాశంలాంటిది. 
 
ఈ చిత్రం షూటింగ్ వల్ల భవిష్యత్‌లో ఒరిస్సా సినిమా షూటింగులతో పాటు పర్యాటక రంగానికి ఒక గొప్ప గమ్యస్థానంగా మారుతుంది. మా దగ్గర షూటింగ్స్ చేసేందుకు అన్ని భాషల ఇండస్ట్రీలను స్వాగతిస్తున్నాం. షూటింగులకు పూర్తి మద్దతు, ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇస్తున్నాం" అని ఒరిస్సా ఉప ముఖ్యమంత్రి తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇపుడు ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Samantha: రికార్డింగ్ డాన్స్ లా ఐటెం సాంగ్స్- బ్యాన్ చేయాల్సిన అవసరం వుందా?