Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బహుముఖ ప్రజ్జాశాలి శ్రీ రామోజీరావుాగారు అక్షరానికి సామాజిక బాధ్యత పెంచారు : పవన్ కళ్యాణ్

Pawan kalyan

డీవీ

, శనివారం, 8 జూన్ 2024 (09:21 IST)
Pawan kalyan
ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ సినీ నిర్మాత, పద్మవిభూషణ్ శ్రీ రామోజీ రావు గారి మరణ వార్త అత్యంత బాధాకరం. మీడియా రంగానికి ఇది తీరని లోటు. భారత సినీరంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి ఎంతో కృషి చేశారు. ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, జనసే పార్టీ తరఫున ఆయనకు మృతి పట్ల నివాళి అర్పిస్తున్నాము అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
 
అస్వస్థతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకుంటారని భావించాను. శ్రీ రామోజీరావుగారు ిక లేరనే వార్త ఆవేదన కలిగించింది. 
 
ఆయన స్థాపించిన ఈనాడు ప్రతిక భారతీయ ప్రతికా రంగంలో పెను సంచలనం. అక్షరానికి సామాజిక బాధ్యత వుందని నిరూపించారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలు వెల్లడిస్తూ జన చైతన్యాన్ని కలిగించారు. ఆ వార్తలు ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు.  ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. తను నమ్మిన సిద్దాంతం ద్వారా ముందుకు వెళ్ళడంతో ప్రజల్లో విశ్వసనీయత సాధించారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏ మాస్టర్ పీస్" మనం గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో మూవీ అవుతుంది: అరవింద్ కృష్ణ