Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈనాడు గ్రూప్‌ ఛైర్మన్‌ రామోజీ రావు కన్నుమూత

Ramoji Rao

సెల్వి

, శనివారం, 8 జూన్ 2024 (07:40 IST)
Ramoji Rao
ఈనాడు గ్రూప్‌ ఛైర్మన్‌, తెలుగు మీడియా మొఘల్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నెల 5న అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో వైద్యులు స్టెంట్‌ను అమర్చారు. 
 
స్టెంట్ ప్రక్రియ తరువాత, అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయన ఆసుపత్రిలో చేర్చారు. 87 ఏళ్ల రామోజీరావు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గతంలో వైద్య చికిత్స పొందారు.
 
రామోజీ రావు తన మీడియా సామ్రాజ్యంతో పాటు అనేక వ్యాపారాలను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందారు. ఆయన ఈనాడు గ్రూప్, రామోజీ ఫిల్మ్ సిటీ, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్‌లను పర్యవేక్షించారు. ఆయన నాయకత్వంలో ఈనాడు తెలుగు మీడియాలో ప్రధాన శక్తిగా మారింది. 
 
ఇక రామోజీరావు మృతి పట్ల మీడియాతో పాటు సినీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. "ఎవ్వరికీ తలవంచని  మేరు పర్వతం .. దివి కేగింది" అంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. రామోజీరావు మృతి పట్ల ఆయన సానుభూతి వ్యక్తం చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్-అనుష్క పెళ్లి.. ఇష్టపడితే వద్దంటామా.. శ్యామలా దేవి