Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీటూపై పూజాహెగ్డే.. అన్యాయం ఎప్పుడు జరిగినా..?

Advertiesment
Pooja Hegde
, శనివారం, 10 నవంబరు 2018 (11:07 IST)
మీటూపై అగ్ర హీరోయిన్ పూజా హెగ్డే స్పందించింది. ఇప్పటివరకు తనకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పింది. వేధింపులకు గురవుతున్న మహిళలకు తాను సాయం చేసేందుకు సిద్ధంగా వున్నానని చెప్పింది. ఒక్కొక్కరి అనుభవాల గురించి వింటుంటే మతి పోతుంది. చాలామంది మీకు ఇలాంటి వేధింపులు ఎదురుకాలేదా..? అని అడుగుతున్నారు. అయినా తనకు ఆ అనుభవం లేదని చెప్పింది. 
 
మీటూపై కొందరు మాత్రం దీని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అన్యాయం ఎప్పుడు జరిగినా.. నష్టం పూడ్చలేనిది. ప్రతి రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని పూజా హెగ్డే పిలుపునిచ్చింది.
 
మీటూ ఉద్యమానికి తాను ఎప్పుడో మద్దతు ప్రకటించానని తెలిపింది. ఈ ఉద్యమం కేవలం ఏ ఒక్క అమ్మాయి కోసమో కాదు.. మహిళలందరికీ సంబంధించిన విషయమని పూజా హెగ్డే వ్యాఖ్యానించింది. ఇటీవల పూజా హెగ్డే అరవింద సమేత ద్వారా తన ఖాతాలో హిట్ సినిమాను వేసుకున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్ట‌ర్ మ‌జ్ను వ‌చ్చేది ఎప్పుడు..?