Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చాల్లేగానీ.. ఇక కూర్చో : విలేకరిని కసురుకున్న కంగనా రనౌత్

Advertiesment
Kangana Ranaut
, శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (16:19 IST)
చిత్రపరిశ్రమలో హీరోయిన్ల వస్త్రాధారణపై ప్రశ్నించిన జర్నలిస్టుకు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ షాకిచ్చారు. ఇక చాల్లే... కూర్చో అంటూ ఘాటుగా కసురుకున్నారు. కంగనా హోస్ట్‌గా కొత్త రియాల్టీ షో "లాక్ అప్" త్వరలోనే ప్రారంభంకానుంది. ఎంఎల్టీ బాలాజీ, ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ప్రసారంకానుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ షో నిర్వాహకులు ప్రచారంలోభాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ షోక్ కోసం ఏక్తా కపూర్ క్రియేట్ చేసిన కాన్సెప్ట్ తనకెంతగానో నచ్చిందని అందుకే తాను ఈ షోను చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా ఓ విలేఖరి హీరోయిన్ల దుస్తులపై ప్రశ్నించారు. ఇది ఆమెకు చిరాకు తెప్పించింది. అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇక కూర్చో అంటూ కసురుకుంది. తమను తాము రక్షించుకోలేని వారిని రక్షించడానికి తాను ఇక్కడ ఉన్నానని, దీపికా పదుకొనే మాత్రం తనను తాను రక్షించుకోగలదని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హృతిక్ రోషన్ నాకు స్పూర్తి- డిజె టిల్లు చూస్తే ఒత్తిడి మర్చిపోతారు - నేహా శెట్టి