Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్ బాస్ 7: ఆరో వారం ఎలిమినేట్ అయ్యిందెవరు?

Bigg Boss 7
, సోమవారం, 16 అక్టోబరు 2023 (10:16 IST)
Bigg Boss 7
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ప్రవేశించారు. వీరిలో వరుసగా మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడో వారం సింగర్ దామిని, నాలుగో వారం రాతిక రోజ్, ఐదో వారం శుభశ్రీ ఎలిమినేట్ అయ్యారు. అక్టోబర్ 8న గ్రాండ్ లాంచ్‌లో అర్జున్ అంబటి, సింగర్ భోలే, నాయని పావని, అశ్విని శ్రీ, పూజా మూర్తి వైల్డ్ కార్డ్‌లుగా ప్రవేశించారు.
 
ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ 7 తెలుగు ప్రారంభమైంది. ఈ ఐదుగురు వచ్చి వారం గడిచింది. తాజాగా నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఆరో వారంలో ప్రిన్స్ యావర్, అమర్ దీప్, నాయని పావని, టేస్టీ తేజ, పూజా మూర్తి, అశ్విని శ్రీ, శోభ శ్రీలు నామినేట్ అయ్యారు. 
 
మొదటి నుంచి ప్రిన్స్, అమర్ ఓటింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నారు.
 
 చివర్లో నాయని పావని, శోభాశెట్టి నిలబడ్డారు. అయితే ఆరో వారంలో శోభాశెట్టి ఎలిమినేట్ అవుతుందని చాలా సర్వేలు చెబుతున్నాయి. కానీ, ఎవరూ ఊహించని విధంగా నాయని పావనిని బిగ్ బాస్ నిర్వాహకులు ఎలిమినేట్ చేశారు. 
 
నాయని హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి చాలా బాగా ఆడుతోంది. శోభాశెట్టిని కాపాడుకునేందుకే నాయనిని బలితీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
 
 ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఫెయిర్ ఎలిమినేషన్‌లు జరిగాయి. కానీ నాయని విషయంలో మాత్రం అన్యాయంగా ఎలిమినేషన్‌ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. 
 
కన్నింగ్ గేమ్ ఆడే శోభా శెట్టిని ఎలిమినేట్ చేసేందుకు పూజా మూర్తి లాంటి వారంతా కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిని కాకుండా నాయనిని ఎందుకు ఎలిమినేట్ చేశారని ప్రశ్నిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రణబీర్‌తో లిప్ లాక్ సీన్‌.. రష్మిక సపరేట్ రెమ్యూనరేషన్ తీసుకుందా?