Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ : ఛత్రపతిని రీమేక్ చేయనున్న వివివినాయక్

Advertiesment
Bellamkonda Sai Sreenivas
, శుక్రవారం, 27 నవంబరు 2020 (11:51 IST)
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇపుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. లోగడ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చి సరికొత్త రికార్డులు నెలకొల్పిన ఛత్రపతి చిత్రం రీమేక్‌తో ఆయన హిందీ వెండితెరకు పరిచయంకానున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వివివినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. 
 
ముఖ్యంగా, హిందీ సినీ ప్రేక్షకులను ఆక‌ట్టుకునేలా స్క్రిప్ట్ వ‌ర్క్‌ను ప్రముఖ కథా రచయిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మార్పులు చేర్పులు చేస్తున్నట్టు సమాచారం. ప్ర‌ధానంగా చిత్రం రెండో భాగంలో వ‌చ్చే స‌న్నివేశాల్లో మార్పులు చేయ‌నున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పూర్తి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కించనున్నారు. 
 
ఈ మూవీని ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెయిన్ ఇండియా రీమేక్ నిర్మాణ బాధ్య‌త‌లు తీసుకోనుంది. ఛ‌త్ర‌పతి రీమేక్‌ని ఎవ‌రు తెర‌కెక్కిస్తారు అని అంద‌రిలో ఆతృత నెల‌కొన్న స‌మ‌యంలో కొద్ది సేప‌టి క్రితం చిత్ర బృందం ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పుకొచ్చింది. 
 
మాస్ డైరెక్ట‌ర్ వీవీ వినాయ‌క్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మాస్ డైరెక్ట‌ర్‌తో క‌లిసి మాస్ హీరో చేయ‌నున్న ఈ రీమేక్ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్‌ని త‌ప్ప‌క షేక్ చేస్తుంద‌ని అంటున్నారు. 
 
విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌నందించిన య‌మ‌దొంగ‌, మ‌గ‌ధీర‌, బాహుబ‌లి.. ది బిగినింగ్‌, బాహుబ‌లి.. ది క‌న్‌క్లూజ‌న్‌, భ‌జ‌రంగీభాయ్ జాన్ వంటి చిత్రాలు భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో స‌రికొత్త  చ‌రిత్ర సృష్టించ‌డంతో తాజా రీమేక్‌పై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ నాలుగో సీజన్.. నో ఎవిక్షన్ కార్డ్ గేమ్.. అఖిల్‌ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ..?