Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభాస్.. ఏంటి ఈ కన్ఫ్యూజన్?

ప్రభాస్.. ఏంటి ఈ కన్ఫ్యూజన్?
, శుక్రవారం, 20 నవంబరు 2020 (12:09 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాథేశ్యామ్ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాథేశ్యామ్ ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ప్రబాస్ ముంబాయిలో వాలిపోయాడు. ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్‌తో చర్చలు జరిపిన తర్వాత ఈ మూవీకి ఆరు నెలలు డేట్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడని తెలిసింది.
 
ప్రభాస్‌తో ఫోటో షూట్ కూడా చేసారని సమాచారం. అయితే... ఆదిపురుష్ మూవీని 2022 ఆగష్టు 11న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే... ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాథేశ్యామ్ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించలేదు కానీ.. ఇంకా స్టార్ట్ చేయని ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించడం ఏంటి అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారట.
 
అంతేకాకుండా... రాథేశ్యామ్ రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వాలని ప్రభాస్ పైన ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో పాన్ వరల్డ్ మూవీని ప్రకటించారు. ఈ సినిమాని త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో అమితాబ్, దీపికా పడుకునే నటిస్తున్నారు.
 
ఇప్పుడు ఆదిపురుష్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఈ సినిమా పరిస్థితి ఏంటి..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో..? రిలీజ్ ఎప్పుడు ఉంటుందో..? అనేది కన్ఫ్యూజన్‌గా ఉంది అంటున్నారు. మరి... ప్రభాస్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బైక్ స్టంట్‌లో గాయపడిన తమిళ హీరో అజిత్.. హైదరాబాద్‌లో చికిత్స