Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

Advertiesment
rashmi gautham

ఠాగూర్

, ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (17:47 IST)
బుల్లితెర యాంకర్, సినీ నటి రష్మికి గత నెలలో మైనర్ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. దీంతో రష్మీకి ఏమైందంటూ ఆమె అభిమానులు పరేషాన్ అయ్యారు. అదేసమయంలో తనకు జరిగిన సర్జరీపై ఆమె ఓ పోస్టు చేశారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో తనకు మద్దతుగా నిలిచిన వైద్యులు, కుటుంబ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 
 
"ఇలాంటి క్లిష్ట సమయంలో నాకెంతో అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు, సుమారు 5 రోజుల్లోనే నా శరీరంలోనే హిమోగ్లోబిన్ శాంతి తొమ్మిదికి పడిపోయింది. జనవరి నుంచి నాకు ఏం జరిగిందో అర్థం లేదు. తీవ్రమైన భుజం నొప్పి, అకాల రక్తస్రావంతో ఇబ్బందిపడుతూ వచ్చాను. ఈ కారణంగా గత నెల 29వ తేదీ నాటికి పూర్తిగా నీరసించిపోయాను. వర్క్ పరమైన కమిట్‌మెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఆస్పత్రిలో చేరా. ఏప్రిల్ 18వ తేదీన చిన్నపాటి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నా. మరో మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలి అని ఆమె తన ఇన్‌‌స్టా ఖాతాలో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు సర్జరీకి ముందు దిగిన ఫోటలను కూడా జతచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్