Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాశీ ఖన్నాతో ఎవరూ సినిమా చేయవద్దంటున్న బడా నిర్మాత.. ఎందుకు?

దిల్ రాజు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది కొత్త హీరోహీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి. కొంతమంది యువ హీరోహీరోయిన్లతో సినిమాలు చేసేందుకు భయపడిన నిర్మాతలు ఉన్నారు. అయితే అలాంటి వారిని పెట్టి సినిమాలు తీసి వారిని పరిశ్రమలో నిలబెట్టారు దిల్ రాజు. ప్రస్తుతం

Advertiesment
Dil Raju
, మంగళవారం, 14 ఆగస్టు 2018 (21:51 IST)
దిల్ రాజు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది కొత్త హీరోహీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి. కొంతమంది యువ హీరోహీరోయిన్లతో సినిమాలు చేసేందుకు భయపడిన నిర్మాతలు ఉన్నారు. అయితే అలాంటి వారిని పెట్టి సినిమాలు తీసి వారిని పరిశ్రమలో నిలబెట్టారు దిల్ రాజు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్ రాశీ ఖన్నాకు అవకాశాలు ఇచ్చి ఆమెను అగ్రహీరోయిన్ సరసన నిలబెట్టింది కూడా దిల్ రాజే.
 
తాజాగా దిల్ రాజు నిర్మాతగా చిత్రీకరించిన సినిమా శ్రీనివాస కళ్యాణం. విడుదలైన కొన్ని రోజులకే మంచి టాక్‌తో సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమా కథను దిల్ రాజు హీరోయిన్ రాశీ ఖన్నాకు వివరించినప్పుడు చాలా బాగుందని చెప్పిందట. అయితే రెమ్యునరేషన్ కాస్త తగ్గించుకోవాలని రాశీ ఖన్నాను దిల్ రాజు కోరారట. అయితే అందుకు ఏమాత్రం రాశీ ఖన్నా ఒప్పుకోలేదట. 
 
దీంతో రాశీ ఖన్నాపై కోపం పెంచుకున్న దిల్ రాజు సినిమా పూర్తయిన తరువాత ఆమెతో ఎవరూ సినిమాలు తీయవద్దని నిర్మాతలకు స్వయంగా ఫోన్లు చేసి చెబుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కాస్తా రాశీ ఖన్నాకు తెలిసి దిల్ రాజును కలిసేందుకు ప్రయత్నిస్తోందట. కానీ దిల్ రాజు మాత్రం ఆమెకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్న ప్రచారం సినీ పరిశ్రమలో జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త పూల వర్షం కురిపిస్తుంటే.. సీమంతానికి అదిరిపోయే స్టెప్పులేసిన నటి