Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''శ్రీనివాస కళ్యాణం''కు వెంకటేష్‌ వాయిస్ ఓవర్.. హైలైట్‌గా నిలుస్తుందట..

సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. నితిన్‌, రాశీఖన్నాలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్త

''శ్రీనివాస కళ్యాణం''కు వెంకటేష్‌ వాయిస్ ఓవర్.. హైలైట్‌గా నిలుస్తుందట..
, శనివారం, 4 ఆగస్టు 2018 (16:48 IST)
సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. నితిన్‌, రాశీఖన్నాలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ సినిమాలో కొన్ని పాత్రలను పరిచయం చేసే సందర్భాల్లోనూ.. కీలకమైన సన్నివేశాలను లింక్ చేసే సందర్భాల్లోను వాయిస్ ఓవర్ వుంటుందట. ఆ వాయిస్ ఓవర్ వెంకటేశ్‌తో చెప్పిస్తే మరింత బాగా కనెక్ట్ అవుతుందని భావించి ఆయన్ని సంప్రదించారు. 
 
అందుకు అంగీకరించిన వెంకీ ఈ సినిమా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ప్రస్తుతం వెంకీ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతోంది. వెంకీ ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకు హైలైట్‌గా వుంటుందని సినీ యూనిట్ వెల్లడించింది.

గతంలో ''శ్రీనివాస కళ్యాణం'' అనే టైటిల్‌తో వేంకటేశ్ ఒక సినిమా చేశారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ అయ్యింది. ఇంకా వెంకీకి మంచి పేరు సంపాదించి పెట్టింది. ప్రస్తుతం అదే టైటిల్‌తో తెరకెక్కే సినిమాకు వెంకీ వాయిస్ ఇవ్వడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దర్శకుడి మూతి పచ్చడి చేసిన నటి అంజలి.. ఎందుకంటే?