Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరో ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు...

టాలీవుడ్ ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న "సాహో" చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెల్సిందే.

Advertiesment
Criminal case
, బుధవారం, 20 సెప్టెంబరు 2017 (09:07 IST)
టాలీవుడ్ ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న "సాహో" చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెల్సిందే.
 
ఈమె తాజాగా దావూద్ సోదరి జీవిత నేపథ్యంలో హసీనా పార్కర్ అనే సినిమా చేసింది. ఈ మూవీ సెప్టెంబర్ 22న విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో శ్రద్ధా ధరించిన దుస్తులను ఏజేటీఎం సంస్థ సమకూర్చగా, ప్రమోషన్స్‌లోనూ తమ బ్రాండ్ దుస్తులనే ధరించాలని సదరు కంపెనీ సంస్థ శ్రద్ధాతో ఒప్పందం కుదుర్చుకుంది. 
 
కానీ శ్రద్ధా ఒప్పందాన్ని పాటించకుండా తన పర్సనల్ డిజైనర్ తయారు చేసిన దుస్తులని ధరించి ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఏజేటీఎం సంస్థ శ్రద్ధా కపూర్‌తో పాటు హసీనా పార్కర్ చిత్ర నిర్మాతలపై కూడా క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసు విచారణ వచ్చే నెల 26వ తేదీన విచారణకు రానుంది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కళ్లారా చూస్తే నమ్మండి కానీ..?: డేటింగ్ వార్తలపై రెజీనా