Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫైన్ చెల్లించమని కోరిందనీ... టీటీఐని రైల్లోనుంచి తోసేశారు...

Advertiesment
Telangana
, గురువారం, 7 మార్చి 2019 (11:00 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట జంక్షన్‌లో ఓ దారుణం జరిగింది. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని అపరాధం చెల్లించమని అడిగినందుకు ఆ మహిళా టీటీఐని రైల్లో నుంచి కిందికి దించేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాజీపేట జంక్షన్‌ రైల్వే కమర్షియల్‌ విభాగంలో టీటీఐగా నీలిమ అనే మహిళ పని చేస్తోంది. ఈమె సికింద్రాబాద్‌ నుంచి ధానాపూర్‌ వెళ్లే పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకుంది. స్లీపర్‌ క్లాస్ ఒకటో నంబరు బోగీలో వెళ్లి ప్రయాణికుల వద్ద టిక్కెట్లను తనిఖీ చేపట్టారు. అపుడు కొందరు ప్రయాణికులు జనరల్‌ టికెట్‌ తీసుకుని స్లీపర్‌క్లాస్‌ కోచ్‌లోకి రావడంతో గుర్తించి, వారందరినీ అపరాధం చెల్లించాలని కోరింది. 
 
అయితే, బోగీ ప్రయాణికులతో రద్దీగా ఉండటంతో ఏ ఒక్క ప్రయాణికుడు ఆమె మాటను పట్టించుకోలేదు. పైగా, ఆమెను కిందికి తోసేశారు. దీంతో ఆమె ప్లాట్‌ఫాంపై పడింది. ఆమె కాలు ప్లాట్‌ఫాం సందులోకి వెళ్లడంతో జనరల్‌ బోగీ ప్రయాణికులు గమనించి బయటికిలాగేశారు. 
 
సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని నీలిమను రైల్వే ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో పాట్నా ఎక్స్‌ప్రెస్‌ కొన్ని నిమిషాల పాటు కాజీపేటలో నిలిపివేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలితను 'హల్వా'తో చంపేశారు : రాష్ట్ర మంత్రి సీవీ షణ్ముగం