Publish Date: Fri, 07 May 2021 (10:00 IST)
Updated Date: Fri, 07 May 2021 (10:01 IST)
కరోనా రక్కసి భయానికి ప్రజలు ప్రయాణాలు చేయడానికి భయపడుతున్నారు. దీంతో అనేక రైళ్లు, బసులు ఖాళీగా తిరుగుతున్నాయి. దీంతో పలు రైళ్లు రద్దవుతున్నాయి. తాజాగా కరోనా నేపథ్యంలో ప్రయాణికుల నుంచి ఆదరణ లేకపోవడంతో 28 ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. ఈ రైళ్ళ రద్దు శుక్రవారం అమల్లోకి వచ్చింది.
రద్దు అయిన రైళ్లలో శుక్రవారం నడవాల్సిన తిరుపతి-విశాఖపట్టణం, సికింద్రాబాద్-కర్నూలు సిటీ, కర్నూలు సిటీ-సికింద్రాబాద్, కాకినాడ టౌన్-రేణిగుంట, విజయవాడ-లింగంపల్లి, విజయవాడ-గూడూరు, నాందేడ్-జమ్ముతావి, బిట్రగుంట-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్-బిట్రగుంట, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్, నర్సాపూర్-నాగర్సోల్, సికింద్రాబాద్-విజయవాడ, విజయవాడ-సికింద్రాబాద్, హైదరాబాద్-సిర్పూరు కాగజ్నగర్, సిర్పూరు కాగజ్నగర్-సికింద్రాబాద్ రైళ్లు ఉన్నాయి.
అలాగే, శనివారం నడవాల్సిన విశాఖ-తిరుపతి, రేణిగుంట-కాకినాడ టౌన్, లింగంపల్లి-విజయవాడ, తిరుపతి-కరీంనగర్, గూడూరు-విజయవాడ, సికింద్రాబాద్-విశాఖపట్టణం, సిర్పూరు కాగజ్నగర్-సికింద్రాబాద్, నాగర్సోల్-నర్సాపూర్ రైళ్లు, 9న నడిచే కాకినాడ టౌన్-లింగంపల్లి, కరీంనగర్-తిరుపతి, జమ్ముతావి-నాందేడ్, విశాఖపట్టణం-సికింద్రాబాద్, 10న నడిచే లింగంపల్లి -కాకినాడ టౌన్ రైళ్లు ఉన్నాయి.