Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు

తెలంగాణలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు
, సోమవారం, 8 నవంబరు 2021 (11:05 IST)
రోజు రోజుకు పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం బస్ చార్జీలు పెంచింది. దసరా కు ముందుగానే బస్ చార్జీలు పెరుగుతాయని భావించినప్పటికీ..కుదరలేదు. ఇక ఇప్పుడు చార్జీలు పెంచక తప్పలేదు.

ఆదివారం ఆర్టీసీ బస్ చార్జీల ఫై సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆఫీస్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
ఈ సమావేశం లో పల్లె వెలుగు బస్సులకు కిలోమీటర్ కు 25 పైసలు మరియు ఎక్స్‌ ప్రెస్‌ లు ఆపై సర్వీసులకు 30 పైసలు పెంచాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే…. సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు మరియు మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు పెంచాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తరువాత అధికారికంగా ప్రకటించనుంది ఆర్టీసీ యాజమాన్యం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ కుటుంబంఫై పగబట్టిన నీలిత్రాచు!