Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆలయంలో చోరీకి వచ్చాడు.. రేకుల మధ్య చిక్కుకొని దొరికిపోయాడు..

ఆలయంలో చోరీకి వచ్చాడు.. రేకుల మధ్య చిక్కుకొని దొరికిపోయాడు..
, గురువారం, 6 మే 2021 (19:10 IST)
చోరీకి పాల్పడి ఓ వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. నిజామాబాద్‌ రూరల్‌ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుఖ్‌జిత్‌ ఫ్యాక్టరీ ప్రధాన గేట్‌ పక్కన గల శ్రీ మహాలక్ష్మి ఆలయంలో బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. అయితే ఆలయం రేకుల మధ్య చిక్కుకొని దొరికిపోయాడు. ఆలయంలో చోరీ చేయడానికి ఓ వ్యక్తి గోడపై నుంచి లోపలికి వెళ్లడానికి యత్నించాడు.
 
ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఆలయం రేకుల మధ్య దొంగ ఇరుక్కుపోయాడు. రేకుల మధ్య ఉన్న నిందితుడిని చూసి పక్కన ఉన్న కొందరు రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని బయటకు తీశారు. 
 
అనంతరం నిందితుడిపై దొంగతనం కేసు నమోదు చేసినట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. నిందితుడిని ఆర్మూర్‌ మండలం మామిడిపల్లికి చెందిన రఘుగా గుర్తించామన్నారు. కాగా నిందితుడు రఘుపై ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కూడా కేసు ఉందని ఆయన పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైనాకు సోనూసూద్ సాయం.. కేవలం 10 నిమిషాల్లోనే ఆక్సిజన్ పంపాడు..