Publish Date: Fri, 23 Apr 2021 (09:32 IST)
Updated Date: Fri, 23 Apr 2021 (09:34 IST)
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. తాజాగా మంత్రి కేటీఆర్కు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా ప్రకటించారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నానని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాబారినుండి సురక్షితంగా బయటపడాలంటూ టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు, మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు.
ఇలా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూడా కేసీఆర్ పేరిట ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో పరిపాలన చేపట్టాలని సుభాష్ రెడ్డి దుర్గమ్మను కోరుకున్నారు.
సెల్వి
Publish Date: Fri, 23 Apr 2021 (09:32 IST)
Updated Date: Fri, 23 Apr 2021 (09:34 IST)